జాతీయ వార్తలు
మాయావతి అభ్యర్థనకు సుప్రీం నిరాకరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: తన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. కాగా ఆమె అభ్యర్థనను స్వీకరించటానికి సుప్రీం నిరాకరించింది. నిషేధంపై ప్రత్యేక పిటిషన్ వేయండి. దీన్ని విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదిలావుండగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి విద్వేష ప్రచారం చేసారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, యూపీ నేత ఆజం ఖాన్లపైన కూడా ఈసీ నిషేధం విధిం చిన విషయం తెలిసిందే. విద్వేష ప్రసంగాలు చేస్తున్న నేతలపై ఈసీ తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఆ చర్యల పట్ల కోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం తన అధికారాన్ని తిరిగి సాధించుకున్నదని, మధ్యంతర ఉత్తర్వులను అవసరం లేదని కోర్టు చెప్పింది.