ఆంధ్రప్రదేశ్‌

ఓటుకు నోటు కేసులో పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపి, ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు సుప్రీం తేల్చిచెప్పింది. కేసుపై నాలుగు వారాల్లో విచారణ జరిపి, పరిష్కరించాలని ఈ సందర్భంగా హైకోర్టుకు సుప్రీం సూచించింది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, ఆ న్యాయస్థానమే విచారిస్తుందని సుప్రీం ధర్మాసం స్పష్టం చేసింది.