జాతీయ వార్తలు

దిల్లీలో డీజిల్, పెట్రోల్ టాక్సీలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మహానగరంలో ఆదివారం (మే 1) నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే టాక్సీలను నడపడానికి వీలు లేదని సుప్రీం కోర్టు శనివారం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్‌కు బదులు గ్యాస్ (సిఎన్‌జి)తో నడిచేలా టాక్సీలను మార్పుచేసుకునేందుకు గడువును పెంచేందుకు అనుమతించే ప్రసక్తి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ గడువు శనివారంతో ముగిసింది. గడువును పెంచితే తమ వాహనాలను సిఎన్‌జి వినియోగానికి అనువుగా మార్చుకుంటామని టాక్సీ సంఘాలు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం త్రోసిపుచ్చింది. వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకే పెట్రోల్, డీజిల్ టాక్సీలను నిషేధించారు.