తెలంగాణ
భూ నిర్వాసితులకు న్యాయం చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 September 2016
హైదరాబాద్: మల్లన్నసాగర్ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని, నిర్వాసితులకు సరైన న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని టి.కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. రాజ్భవన్లో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి తదితరులు గవర్నర్ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది లేదన్నారు. నిర్వాసితుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.