తెలంగాణ

ఇతరులకు గదుల కేటాయింపుపై టిడిఎల్‌పి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గతంలో తమకు కేటాయించిన గదులను ఇతరులకు కేటాయించడం పద్ధతి కాదని టిడిఎల్‌పి నాయకులు విమర్శిస్తున్నారు. తాము గదులను ఖాళీ చేయకుండానే వాటిని వేరేవారికి ఇవ్వడంలో స్పీకర్ మధుసూదనాచారి ఏకపక్షంగా వ్యవహరించారని టిడిపి నేత రేవంత్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై అవసరమైతే తాము కోర్టుకు వెళతామన్నారు. అలాగే, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఎర్రబిల్లి దయాకరరావుకు ఏపి ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో నివాసం కేటాయించడం సరికాదని ఆయన ఎపి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎర్రబిల్లి చేత క్వార్టర్సు ఖాళీ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు.