రాష్ట్రీయం

తెలుగుజాతికి ద్రోహం చేస్తున్న వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి అధికార ప్రతినిధి అనురాధ

హైదరాబాద్, డిసెంబర్ 12: రాజధాని నిర్మాణం విషయంలో తెలుగుజాతికి ద్రోహం తలపెట్టే విధంగా వైకాపా వ్యవహరిస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. కుంభకోణాల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బొత్స సత్యనారాయణ నేడు స్కామ్‌ల గురించి మాట్లాడటం విడ్డూరమని అన్నారు. తెలుగువారు గర్వించే విధంగా అమరావతిని ప్రపంచస్థాయిలో నిర్మించేందుకు చంద్రబాబు కృషి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని అన్నారు. రాజధాని స్థలం ఎంపిక దగ్గర నుండి భూ సమీకరణ, శంకుస్థాపన కార్యక్రమాల వరకూ అడుగడుగునా అడ్డుతగిలారని, రాజధాని రైతులను రెచ్చగొట్టేందుకు జగన్ విశ్వప్రయత్నం చేశారని వారి దీక్షలు అన్నీ నీరుగారిపోయాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం జరిగితే ఉనికి కోల్పోతామని భయపడుతూ అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు.