తెలంగాణ

తెలంగాణలో మరో పరువుహత్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం: తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో గడ్డి కుమార్‌ అనే యువకుడిని యువతి బంధువులే చంపేశారని బంధువులు అంటున్నారు. కుమార్ ఓయువతితో ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో గత రాత్రి తాడికల్ శివారులో కుమార్ శవమై కనిపించాడు. యువతి బంధువులే కుమార్‌ను చంపేశారని ఇది ఖచ్చితంగా పరువు హత్యే అని యువకుడి బంధువులు అంటున్నారు. కుమార్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విచారణ కోసం వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. జీపు అద్దాలను ధ్వంసం చేశారు.