తెలంగాణ

గ్రామస్తుల దాడితో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మహిళా సర్పంచ్‌ను బైక్‌తో ఢీకొట్టాడని గ్రామస్థులు చితకబాదడంతో ఓ యువకుడు మృతి చెందగా, ఇబ్రహీంపూర్‌లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో సర్పంచ్ లక్ష్మిని కరీంనగర్ జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో రెచ్చిపోయిన గ్రామస్తులు చితకబాదడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం తెలుసుకొని జిల్లెల గ్రామస్థులు యువకుడి మృతదేహంతో ఇబ్రహీంపూర్‌లో ఆందోళన చేపట్టారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టి ఆమె బంధువులపై దాడి చేశారు. మరో రెండు ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఇరువర్గాల ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.