రాష్ట్రీయం

ఉన్మాది వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇనుప రాడ్‌తో దాడి * ముగ్గురు మృతి
మృతుల్లో ఎంపిటిసి సభ్యురాలు
కోరుకొండలో దారుణం
కోరుకొండ, డిసెంబర్ 24: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో గురువారం ఒక ఉన్మాది ఇనుప రాడ్డుతో దాడి చేసి ముగ్గురిని హతమార్చాడు. కోరుకొండ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న రామచంద్రరావుపేట కాలనీలో నివాసం ఉంటున్న ఏడిద ఆనంద్‌కుమార్ కొనే్నళ్ల క్రితం ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం మతిస్థిమితం కోల్పోయిన అతను తన అన్న ఇంట్లో ఉంటున్నాడు. గురువారం అకస్మాత్తుగా ఉన్మాదిగా మారిన ఆనంద్‌కుమార్ తన అన్న భార్య లలిత (33) తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. దీనితో రక్తపుమడుగులో కుప్పకూలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతిచెందిది. ఇది గమనించిన అదే కాలనీకి చెందిన ఏడిద నాగభూషణం (45), కోరుకొండ ఎంపిటిసి-2 సభ్యురాలు ఖండవిల్లి కుమారి (33) ఉన్నాదిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, వారిపై కూడా ఇనుపరాడ్డుతో దాడిచేశాడు. నాగభూషణం అక్కడిక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన కుమారి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న కోరుకొండ పోలీసులు నిందితుడు ఆనంద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. (చిత్రం) గాయపడిన ఎంపిటిసి సభ్యురాలు కుమారి