రాష్ట్రీయం
భక్తుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటాం:టీటీడీ ఇఓ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 July 2018
తిరుమల: మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆలయ ఇఓ అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆలయాన్ని మూసివేయాలనే నిర్ణయంపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇచ్చినా ఎక్కువ సంఖ్యలో వస్తే ఇబ్బందులు పడతారనే ఉద్దేశ్యంతోనే ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ 24న టీటీడీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఈలోగా భక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు.