తెలంగాణ

ఇద్దరు జడ్జిలపై హైకోర్టు సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న అభియోగంపై ఇద్దరు జడ్జిలను హైకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. జడ్జిలకు ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఆందోళనలు చేస్తూ ఆదివారం నాడు రాజ్‌భవన్ వరకూ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌లను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆంధ్ర జడ్జిలను తెలంగాణ నుంచి పంపేయాలని డిమాండ్ చేస్తూ న్యాయమూర్తులు సామూహిక రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. కాగా, ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసినందుకు న్యాయవాదులు సోమవారం మరోసారి ఆందోళనకు దిగారు.