జాతీయ వార్తలు

తృణమూల్‌పై ఇసికి బిజెపి నేతల ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బిజెపి నేతలు మంగళవారం ఇక్కడ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి రెండు విడతల పోలింగ్‌లో పలు చోట్ల హింసకు తృణమూల్ కాంగ్రెస్ బరితెగించిందని వారు ఆరోపించారు. మిగతా విడతల పోలింగ్‌లోనైనా శాంతిభద్రతలను కాపాడాలని వారు కోరారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఈ వినతిపత్రాన్ని బిజెపి నేతలు పంపారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు వినతిపత్రాలపై సంతకాలు చేశారు.