తెలంగాణ

సెటిలర్లపై టిఆర్‌ఎస్‌కు ప్రేమ లేదు: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: టిఆర్‌ఎస్ పార్టీ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిచేందుకు సెటిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తోందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే అక్రమంగా సంపాదించిన సొమ్ముతో టిఆర్‌ఎస్ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందన్నారు. ఇతర పార్టీ నాయకులకు గులాబి కండువాలను కప్పడం తప్ప ఆ పార్టీ ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. మెట్రోరైల్, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, ఎక్స్‌ప్రెస్‌హైవే, పాతబస్తీ అభివృద్ధి, ఐటి, ఫార్మా రంగాల అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. హైదరాబాద్‌లోని ప్రజలకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనన్నారు. గతంలో టిఆర్‌ఎస్ సెటిలర్లను అవమానపరిచిందని, నిందించిందన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వారి పట్ల ప్రేమను ఒలకపోస్తోందన్నారు. రాజకీయాల అవసరాల కోసం టిఆర్‌ఎస్ పార్టీ దిగజారుడు వైఖరిని అవలంభిస్తోందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏమి పని ఉందని టిఆర్‌ఎస్ నేతలన్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సెటిలర్లు అధికంగా ఉండే ప్రాంతాలపై దాడులు చేసి అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేతల పర్వం మొదలు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రెండు నాల్కల ధోరణితో రాజకీయా ప్రయోజనాల కోసం టిఆర్‌ఎస్ చేస్తున్న ఎత్తులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే హైదరాబాద్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే పార్టీ అని, అన్ని ప్రాంతాల ప్రజలను కలుపుకుని పోతామని ఆయన చెప్పారు.