హైదరాబాద్

టిఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఆడుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, జనవరి 23: ఎన్‌టిఆర్‌పై ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి గత 30 సంవత్సరాలుగా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటున్నానని ప్రాణం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. శనివారం నగరంలో పలువురు తెదేపా ప్రముఖులతో పాటు అరికెపూడి గాంధీ టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ పలు చానళ్లలో ప్రసారమైన వార్తలను తీవ్రంగా ఖండిస్తూ వివేకానందకాలనీలోని ఆయన నివాసంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతూ గ్రేటర్‌లో గెలిచేందుకు అనేక రకాల ఎత్తు గడలకు పాల్పడుతూ తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ లోబరుచుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలోనే వందలాది ఐటి కంపెనీలు ఉండి పేరున్న ప్రాంతం శేరిలింగంపల్లి నియోజకవర్గమని తనను నమ్ముకొని ప్రజలు రాష్ట్రంలోనే 78వేల అత్యధిక మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. తనకు గతంలో టిఆర్‌ఎస్ నాయకులు పార్టీ మారితే మంత్రి పదవులు ఇస్తామని ఆశలు చూపారని శేరిలింగంపల్లి ప్రజలకు తను నమ్మకద్రోహం చేయనని అన్నారు. శనివారం అనేక చానల్స్‌లో తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టుగా తన వివరణ తీసుకోకుండా అదే పార్టీవారితో కలిసి తప్పుడు ప్రచారానికి పాల్పడ్డాయని తన అనుమతి లేకుండా ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నిస్తూ వారిపై చట్టపరంగా తగినచర్యల కోసం ప్రెస్ కౌన్సిల్, బిసిసి, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెదేపాకు ప్రజలు బ్రహ్మరథం పడుతారని అత్యధిక సీట్లను గెలిపించుకొని తెదేపా అధినాయకుడు చంద్రబాబుకు కానుకగా అందచేస్తామని తెలిపారు.