జాతీయ వార్తలు

ట్రంప్ గెలవాలని హిందూసేన యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ముస్లిం మతోన్మాద ఉగ్రవాదుల నుంచి భారత్‌ను రక్షించే సత్తా డోనాల్డ్ ట్రంప్‌కు ఉందని హిందూసేన కొనియాడింది. అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలో ట్రంప్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం హిందూసేన యాగం నిర్వహించింది. అమెరికాలో ముస్లింలను అడుగుపెట్టనీయనని, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేస్తానని చెబుతున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే ముస్లిం మతోన్మాదలు ఆటలు సాగవని సేన నాయకులు అంటున్నారు. యాగం నిర్వహించిన స్థలంలో ట్రంప్ ఫొటో ఉంచి పూజలు చేశారు.