తెలంగాణ
మరో వివాదంలో బాసర అమ్మవారి ఆలయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 18 February 2018
బాసర, ఫిబ్రవరి 17: బాసర క్షేత్రంలో మరో వివాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యా హ్నం అమ్మవారి నివేదన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద కొందరు తెరాస నాయకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించడం వివాదానాకి కేంద్ర బిందువుగా మారింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12-30 గంటల నుంచి 2-00 గంటల వరకు ప్రతిరోజూ ఆలయాన్ని మూసివేస్తారు. అయ తే ఆ సమయంలో కొందరు టీఆర్ఎస్ నాయ కులు అమ్మవారికి పూజలు చేశారని కొందరు భక్తులు ఆరోపించారు. ఈ విషయమై ఆలయ సూపరింటెండెంట్ను వివరణ కోరగా ఆలయ నిబంధనల మేరకే పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు.