తెలంగాణ

పల్లెపల్లెలో కళా బృందాలతో ప్రజాచైతన్య యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: పల్లె పల్లెలో కళా బృందాలతో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. త్యాగరాయ గానసభలో సోమవారం నాడు జరిగిన బిజెపి ధూం ధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి మనోహర్‌రెడ్డి, కార్యదర్శి పి పాపారావు, సంగీత దర్శకుడు మంత్ర ఆనంద్, గేయ రచయిత వౌనశ్రీ మల్లిక్, సినీ కథానాయకుడు వైభవ్, జన చైతన్య మండలి రాష్ట్ర కన్వీనర్ మద్దం మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కళాకారులేనని, కళాకారులే ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా ఆత్మహత్యలు ఆగలేదని, పదవులను తెలంగాణ ద్రోహులే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.