తెలంగాణ

పేథలు, బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని బిసి సంక్షేమ మంత్రి జోగురామన్న తెలిపారు. సంక్షేమ పథకాల వాల్‌పోస్టర్‌ను మంత్రి తన ఛాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఎంబీసీ సంఘం కన్వీనర్ గడ్డం సాయికిరణ్ నేతృత్వంలో ఈపోస్టర్‌ను రూపొందించారు. ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతోందని వీటిపై ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలంతా ఉపయోగించుకుంటేనే వీటికి సార్థకత కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంబీసీ కార్పోరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఎంబీసీ సంఘం నాయకులు బెల్లం మాధవి, పల్లవి, సింగీతం సాయి, అనూప్, గింగిరెద్దుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జెల్లెల్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.