తెలంగాణ

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: రైతుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు కిసాన్, ఖేత్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి అధ్వర్యంలో కొంత మంది నాయకులు, కార్యకర్తలు, రైతులు వెళ్లారు. అయితే ఆ సమయంలో కమిషనర్ లేకపోవడంతో వారు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు ఉపక్రమించారు. కమిషనర్ వెంటనే రావాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని వారు నినాదాలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటలు మార్కెట్‌లకు తీసుకుని వస్తే వర్షాలతో పంట దెబ్బతిన్నది కాబట్టి కొనలేమని సిబ్బంది చెప్పారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు