తెలంగాణ

హుస్సాముద్దీన్‌ను అభినందించిన ఎంపీ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఏప్రిల్ 20: నిజామాబాద్ జిల్లా కేం ద్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు మహ్మద్ హుస్సాముద్దీన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎం.పీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హుస్సాముద్దీన్ ఇటీవల జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో రాణించి కాంస్య పతకాన్ని సాధించిన విష యం విదితమే. ఈ సందర్భంగా ఎం.పీ కవిత ఆయనను ప్రశంసిస్తూ, జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఇందూరు ప్రతిష్ఠను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బాక్సింగ్ కోచ్ సంసాముద్దీన్ తదితరులు ఉన్నారు.

చిత్రం..కామనె్వల్త్ క్రీడల్లో సత్తా చాటిన బాక్సింగ్ క్రీడాకారుడు హుస్సాముద్దీన్‌ను అభినందిస్తున్న ఎంపీ కవిత