తెలంగాణ
22న సగర శంఖారావం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 April 2018
హైదరాబాద్, ఏప్రిల్ 20: సగర కులానికి చెందిన వారి హక్కుల కోసం పోరాటం చేసేందుకు ఈ నెల 22న ‘సగర శంఖారావం’ పూరించనున్నట్లు సగర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీరడి భూపేష్ సాగర్ తెలిపారు. సగర హక్కుల పోరాట సమితి నాయకులు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సగర శంఖారావం వాల్ పోస్టర్ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ శంఖారావం సభను ఈ నెల 22న నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, సభకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను ముఖ్యఅతిథిగా, ఆర్.కృష్ణయ్యను గౌరవ అతిథిగా ఆహ్వానించామని భూపేష్ సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సగర కులానికి చెందిన వారు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.