తెలంగాణ

ప్రజల కోసమే ఏపీ సీఎం బాబు ధర్మ పోరాట దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పుట్టిన రోజు వేడుకను జరుపుకోకుండా ప్రజల కోసం ధర్మపోరాట దీక్ష చేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. చంద్రబాబు 69వ జన్మదినోత్సవం సందర్భంగా రమణ ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రమణ ప్రసంగిస్తూ 1995 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారని అన్నారు. హైటెక్ సిటీ, సైబరాబాద్‌కు రూపకల్పన చేసి నిర్మించి ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబుదేనని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ధర్మపోరాటానికి దిగారనిరమణ తెలిపారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.