తెలంగాణ

ప్రత్యేక విమానంలో షిర్డీ వెళ్లిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక విమానంలో మహారాష్టల్రోని షిర్డీకి వెళ్లారు.
షిర్డీ సంస్థాన్‌లో సాయిబాబా సమాధిని దర్శించుకుని ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు కూతురు, ఎంపి కవిత కుటుంబం, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ కుటుంబం కూడా షిర్డీ వెళ్లిన వారిలో ఉన్నారు. షిర్డీ ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం ఆధ్వర్యంలో షిర్డీలో నిర్మించిన మెగా సాయి ధర్మశాలను సీఎం సందర్శించారు. ఆ తర్వాత సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.