తెలంగాణ
ఏటిఎంల ఏజెన్సీ సంస్థలో చోరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మే 21: హైదరాబాద్ నార్త్జోన్ పరిధిలోని మహేంద్ర హిల్స్లో గల ఏటిఎం ఏజెన్సీ సంస్థలో భారీ చోరీ జరిగింది. ఏటిఎంలకు నగదు సరఫరా చేసే ఏజెన్సీ సంస్థలో రూ. 9కోట్లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు శనివారం సంస్థ అధికారులు తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన చోరీ శనివారం వెలుగులోకి వచ్చింది. ఆర్సిఐ క్యాష్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు సంస్థలో పనిచేసే లోకేశ్, ప్రవీణ్లపై అనుమానం ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సంస్థలో పనిచేస్తున్న లోకేశ్, ప్రవీణ్ పరారీలో ఉన్నందున వారిపైనే అనుమానం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.