తెలంగాణ
కోటిలింగేశ్వరాలయంలో లడ్డ్డూలకు బూజు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 May 2016
సిద్దిపేట, మే 21: మెదక్ జిల్లా సిద్దిపేట కోటిలింగేశ్వరాలయంలో శనివారం ఆలయ కౌంటర్లో బూజు పట్టిన లడ్డూలను విక్రయించడంతో భక్తులు ఆందోళన చేపట్టారు. శనివారం గుడికందుల శ్రీనివాస్గౌడ్, రాజలింగంలు కారుకు పూజ చేయించి ప్రసాదం కొనుగోలు చేశారు. లడ్డూలు బూజు పట్టి దుర్వాసన రావడంతో కౌంటర్ నిర్వహకులను నిలదీశారు. అయతే అవి తాజావేనని నిర్వాహకులు చెప్పగా, లడ్డ్డూను విప్పి చూపించడంతో వారు కంగుతిన్నారు. ఈ విషయాన్ని అలయ చైర్మన్ తడకమడ్ల ఈశ్వరయ్య దృష్టికి తీసుకెల్లడంతో వాటిని పడవేయించారు. దీనిపై ఈఓ శ్రీనివాసశర్మను వివరణ కోరగా, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బూజు పట్టిన ప్రసాదం అమ్మిన కాంట్రాక్టర్పై విచారణ జరుపుతామన్నారు.