తెలంగాణ

సమన్యాయానికి స్థానికతే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాశ్దాలుగా చోటు చేసుకున్న అసమానతలను సమూలంగా రూపు మాపుతూ, ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సమన్యాయం పాటించేందుకు కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో స్థానికత అంశం కీలకం కానున్నది. ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్దమనుషుల ఒప్పందం, రాష్టప్రతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్‌గ్లానీ నివేదికలు, తెలంగాణ వాసులకు జరిగిన అన్యాయాన్ని నిలువరించ లేక పోయాయి.
నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలు అధికంగా దక్కగా, చాలాకాలం అనంతరం ఉవ్వెత్తున లేచిన ఉద్యమ ఫలితంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాల్సి ఉండెను. దీని ప్రకారం 15సంవత్సరాల కనీస నివాస యోగ్యతగా స్థానికత్వ నిర్ధారణ జరగాల్సి ఉండెడిది. అంతేకాక ఉద్యోగ విమణ తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలనే షర్తులు విధించ బడినాయి. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందటానికి నివాస నిబంధన 12సంవతరాలు ఉండాలని నిర్ణయించ బడింది. 1973 సెప్టెంబర్ 23న జారీ అయిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా 1975 అక్టోబర్ 18న రాష్టప్రతి ఉత్తర్వులు 674 (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ అయి, రాష్ట్రాన్ని 1,2,3 కోస్తాంధ్ర, 4రాయలసీమ మరియు 5,6 తెలంగాణ జోన్లుగా విభజించారు. ఈఉత్తర్వులోని పేరా 14 ప్రకారం కొన్నింటిని స్థానిక రిజర్వేషన్‌ల పరిధినుండి తప్పించడం జరిగింది. హైదరాబాద్ లోని మినహాయించిన ఆఫీసులకు కాకుండా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆఫీసులలో లోకల్ రిజర్వేషన్ పాటించాల్సిందని పేరా 20 సూచించింది. అలాగే పేరా 9 ప్రకారం 10వ తరగతి నుండి కింది స్థాయి 4వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధిగా, ఆజిల్లాలో 4సంవత్సరాలు చదువును స్థానికంగా వివరించారు. రాష్టప్రతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80%, జోనల్‌స్థాయిలో 60% స్థానికులకు ఉద్యోగాలు రిజర్వు చేయబడినాయి. రిజర్వు చేయబడినవి పోగా, మిగిలినవి ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి.
వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. 1919నుండి అమలులోనున్న నివాస యోగ్యతను 15నుండి 12కు (1956లో) అనంతరం 1975లో 4సంవత్సరాలకు తగ్గించగా, వివక్షత కొనసాగింది. రాష్టప్రతి ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా జోనల్‌వారీ విధానాన్ని సైతం తుంగలో తొక్కి, స్వార్థమే పరమార్థంగా పాలన కొనసాగించడం జరిగింది. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నియమించిన జయభారత్ రెడ్డి, కమలనాథన్, ఉమాపతిలతో సీనియర్ ఐఎఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ, 1975నుండి 1984మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలను పరిశీలించి సమర్పించిన 36పేజీల 1981 జూన్ 30నాటి నివేదికలో, జోన్ల రిజర్వేషన్లకు విరుద్దంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1,2,3లకు చెందిన వారు తెలంగాణకు చెందిన 5,6 జోన్లలో 58,986 మంది నిబంధనలకు విరుద్దంగా నియమింప బడినట్లు పేర్కొనడం జరిగింది. ఈనివేదికను పరిశీలించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1985 డిసెంబర్ 30న 610 జీవోను జారీ చేశారు. గత పాలకులు చేసిన తప్పులను దిద్దుకునే క్రమం లో 1986 మార్చి 30కల్లా 610 జీవోను అమలు పరిచి, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ ఎవరి జోన్లకు వారిని పంపుతామని ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్‌ను గద్దెదింపి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గిర్‌గ్లానీ ఏకసభ్య కమిషన్‌ను పున:పరిశీలనకై నియమించగా, నివేదిక సమర్పించిన గిర్‌గ్లానీ స్థానికేతరులను నిర్ధారించగల సంపూర్ణ సమాచారం పొందకుండానే, సమర్పిత నివేదికలో రాష్టప్రతి ఉత్తర్వులను 126 పద్దతులలో ఉల్లంఘించడం జరిగిందని వివరించి, వాటిని 18రకాలుగా వర్గీకరించి, 35పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. ఉద్యోగ నియామకాలన్నీ జోనల్ నిబంధనలను అనుసరించి జరగాల్సి ఉండగా, జోనల్ ఆఫీసులను రాష్టస్థ్రాయి కార్యాలయాలుగా మార్చి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం జరిగిందని, ఈబదిలీలు తప్పని కమిషన్ అభిప్రాయపడ్డది. గిర్‌గ్లానీ నివేదిక ప్రకారం సగంమంది స్థానికేతరులు ఉన్నారని స్పష్టం అయింది. ఇదిలా ఉండగా సదరు అన్యాయానికి ఇకనైనా అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసి నేతలు కారెం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమై, పలు అంశాలను ప్రతిపాదించారు. ఉపముఖ్యమంత్రి కడియం కమిటీ సూచించిన విధంగా 1నుంపి 7వ తరగతి వరకు పరిగణలోనికి తీసుకోకుండా, రాష్ట్రంలో 4నుండి 12వ తరగతి వరకు వరుసగా 7ఏళ్ళ పాటు చదివిన వారినే స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించారు. విద్యార్థులు స్థానికేతరంగా చదివితే, వారి తల్లిదండ్రుల స్థానికతనే పరిగణించాలని పేర్కొన్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్లకు 80:20 నిష్పత్తిని స్థానిక, స్థానికేతరులకు వర్తింప చేయాలని, కొత్త నియామకాలలో 70శాతం పదోన్నతుల ద్వారా, 30శాతం నేరుగా చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణలోని జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్ల 3లక్షల పోస్టుల వివరాలను పేర్కొంటూ, జూనియర్ అసిస్టెంట్, క్రింది స్థాయి జిల్లా స్థాయికి, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు జిల్లా స్థాయిలో, గజిటెడ్ హెచ్‌ఎంలు, ఎంఇఓలు జోనల్‌లో, ఉప విద్యాధికారులు బహుళ జోన్‌లో, అపైన రాష్ట్ర స్థాయిలో ఉండాలని సూచించారు. సదరు తీర్మానాల అంశాలను సిఎస్ జోషికి సమర్పించారు.
సిఎం కేసిఆర్ నిర్ణయానుసారం 7జోన్లు, 2మల్టీజోన్లను ఖరారు చేసిన క్రమంలో, కోరి, కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో గత పొరపాట్లు పునరావృతం కాకుండా, స్థానికత గురించి, ఉద్యోగ జేఏసి సూచనలు పరిగణించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందనడంలో సందేహం లేదు.

- సంగనభట్ల రామకిష్టయ్య