తెలంగాణ

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం : వీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం కోటీశ్వరులే లబ్ధి పొందుతున్నారు కాని సామాన్య రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించారని తెలిపారు. ఇటీవల వరంగల్‌లో ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం తీరు పై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం సరైంది కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తున్నట్టే వరంగల్ ఖాజీపెట్‌లో రైల్వే కర్మాగారం కోసం ఉద్యమించాలని హనుమంతరావు పిలుపునిచ్చారు.