తెలంగాణ

సోదరుడి వర్ధంతికి హాజరైన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, మే 23: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలోని సోదరుడు (పెద్దమ్మ కుమారుడు) దివంగత గండ్ర రంగారావు ప్రథమ వర్థంతి కార్యక్రమానికి సిఎం కెసిఆర్, ఆయన సతీమణి శోభలు సోమవారం హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు రావాల్సిన సిఎం 12.30 గంటలకు చేరుకున్నారు. అక్కడ నుంచి సుమారు 600 మీటర్ల దూరంలో ఉన్న రంగారావు ఇంటికి భారీ పోలీసుల నడుమ కాన్వాయ్‌లో వచ్చారు. రంగారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు ప్రవీణ్‌రావు కుటుంబీకులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం భోజనం చేసిన సిఎం మధ్యాహ్నం 1.02 గంటలకు కాన్వాయ్‌లో హెలిప్యాడ్ వద్దకు తిరిగి వెళ్లారు. 1.10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయన వెంట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపిలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు.

చిత్రం రంగారావు చిత్ర పటానికి కెసిఆర్ నివాళి