తెలంగాణ

విశ్రాంత సీఈ శ్యాంప్రసాద్ రెడ్డికి పుత్ర వియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, జూన్ 17: విశ్రాంత సీఈ, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజనీర్ల సంఘం నాయకుడు శ్యాంప్రసాద్ రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్రారెడ్డి (37) గుండెపోటుతో మరణించారు. శ్యాంప్రసాద్ చిన్న కుమారుడైన విపిన్ సైదాబాద్‌లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర గుండె నొప్పితో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రలు కేటీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి రాగన్నగూడలోని శ్యాంప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు కూడా శ్యాంప్రసాద్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.