తెలంగాణ

31న మాజీ సైనికుల పెన్షన్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈనెల 31న పెన్షన్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్టు సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు కర్నల్ పీ.రమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ సైనికులు, వితంతువులు, వారి వారసులు పింఛన్లు అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ అదాలత్‌ను వినియోగించుకోవచ్చునన్నారు. పీసీడీఏ అలహాబాద్ నిర్వహిస్తున్న అదాలత్‌లో ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం లభించనుందని అన్నారు. నగరంలోని డీపీడీ ఓ మాసబ్‌ట్యాంక్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అదాలత్ కొనసాగుతోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం మాసాబ్‌ట్యాంక్ డీపీడీఓ కార్యాలయం 040-23317409, మడ్‌కోట డీపీడీ ఓ కార్యాలయం 040-27845026 సంప్రదించాలని సూచించారు.