తెలంగాణ

కేసీఆర్ మోసాలపై నిలదీసేందుకే రాహుల్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నందున ప్రశ్నించేందుకే ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13న నగరానికి వస్తున్నారని టీ.పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశం కావాలని రాహుల్ భావిస్తే టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులు అడ్డుకుంటామని చెప్పడం సమంజసం కాదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఉద్యమం సమయంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ రాలేదని కొంత మంది విద్యార్థులు రెచ్చగొడుతున్నారని అన్నారు. అసలు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు కారణమో ఆ విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు. విద్యార్థులను పెట్రోలు పోసుకోవాలని రెచ్చగొట్టింది టీ. హరీష్‌రావు కాదా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన తెలిపారు.