తెలంగాణ
నేతల దిగ్భ్రాంతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 September 2018
హైదరాబాద్, సెప్టెంబర్ 11: జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదంపై జనసేన అధినేత పవన్కళ్యాణ్, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే జీ కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపాన్ని , విచారాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియో చెల్లించాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు. ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇంత మంది మరణం కలచివేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. బస్సు ప్రమాదం అత్యంత విషాదమని, గుండెలు పిండేసే హృదయవిదారక సంఘటన అని పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.