తెలంగాణ

మహాకూటమి నేతల పొత్తుల చర్చలు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పొత్తుల చర్చలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్-టీడీపీలు మిగతా విపక్షాలను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మంతనాలు జరిపారు. రమణ తమ పార్టీకి 30 సీట్లు కావాలని కోరినట్లు సమాచారం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి కూడా ఉత్తమ్‌ను కలిసి ఆశిస్తున్న 8 సీట్ల జాబితా అందజేశారు. ఇలాఉండగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఉత్తమ్‌ను కలిసి ఆశిస్తున్న 22 సీట్ల జాబితాను అందజేసినట్లు సమాచారం.
అయితే ఏయే సీట్లు కోరారన్నది ఆయన చెప్పడం లేదు. తాము ఆశిస్తున్న సీట్ల జాబితాను అందజేశామని మాత్రమే ఆయన చెప్పారు.