తెలంగాణ

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం వచ్చినా తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపంతో డిగ్రీ చదివిన ఓ నిరుద్యోగ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెహ్రూనగర్‌లో గురువారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయ. నర్సంపేట పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఇప్ప సాంబయ్యకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన ఇప్ప నరేష్ (20) రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. నాటినుండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యాడు. ఇదిలావుండగా గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి రెండేళ్లయనా తనకు ఉద్యోగం రాలేదని, చదువుకున్న యువతకు ఈ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. నరేష్ మృతితో నెహ్రూనగర్‌లో విషాధచాయలు అలుముకున్నాయ.