తెలంగాణ

కూటమి పేరు చెబితే కేసీఆర్ గుండెల్లో రైళ్లు: టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న తరుణంలోనే మహా కూటమి ఏర్పడిందని, మహా కూటమిని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. ఆశీర్వాద సభల పేరుతో టీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే టీఆర్‌ఎస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారని, పరిగెట్టిస్తున్నారని అన్నారు. ఉద్యమంలో తెలంగాణ సమాజం ఆకాంక్షలకు ప్రాణాలు వదిలిన అమర వీరుల ఆత్మలు ఘోషించే విధంగా టీఆర్‌ఎస్ పాలన సాగిందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ డొల్లతనం బయట పడిందని, హరీష్ రావుకు నిజాయితీ ఉంటే మహాకూటమిన ప్రశ్నించే ముందు కేసీఆర్‌ను ప్రశ్నించాలని అన్నారు. బీజేపీతో ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో టీఆర్‌ఎస్ బయటపెట్టాలని అన్నారు. ఒకవైపు బీజేపీతో లోపాయికారి ఒప్పందం మరో వైపు ఎంఐఎం మిత్రపక్షం అంటూ చెప్పుకునే టీఆర్‌ఎస్‌కు టీడీపీని ప్రశ్నించే అర్హత లేదని అన్నారు. చంద్రబాబును ఊబిలోకి లాగాలనే దుష్టపన్నాగం టీఆర్‌ఎస్ పెద్దలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, సెప్టెంబర్ 8వ తేదీనే తాము కలిసొచ్చే పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పడం జరిగిందని అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్‌ఎస్ ఆటలు సాగవని అన్నారు.