తెలంగాణ

పోడు రైతులకూ రైతు బంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: పోడు రైతులకూ రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పోడు భూముల సాగుదారులపై అటవీ అధికారులు, పోలీసులు జరుపుతున్న వేధింపులు, దాడులను వెంటనే నిలిపి వేయాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. పోడు రైతులకు రక్షణ లేకుండా పోయిందని, ఏళ్ళ తరబడి భూమిని నమ్ముకుని బతుకుతున్న పోడు రైతులు వేధింపులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. హక్కు పత్రాలు ఉన్న పోడు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.