తెలంగాణ

కాంగ్రెస్ రెబల్‌గా బరిలో ఉంటా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, నవంబర్ 19: చివరకు వరకూ తనకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తామని నమ్మించి కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి వర్గానికి పూర్తిగా అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి సుభాష్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బీఎస్పీ అభ్యర్థిగా, స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖల్ చేసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రజలు తనను ఆదరిస్తున్నారని, తాను స్వాతంత్య్ర అభ్యర్థిగా పోటి చేసిన బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో వుంటున్నట్లు స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ప్రాంతం పూర్తిగా వెనుకబడి పోతోందని, ఈప్రాంత అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే తాను ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లోని ప్రజలందరికి అందుబాటులో ఉండి అభివృద్ధి చేతల్లో చేసి చూపిస్తానని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..ఎల్లారెడ్డిలో విలేఖరులతో మాట్లాడుతున్న సుభాష్ రెడ్డి