తెలంగాణ

కుటుంబ పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, నవంబర్ 19: కుటుంబ పాలనకు చరమగీతం పాడి.. బీజేపీకి పట్టం కడదామని శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ బీజేపీ అభ్యర్థిగా ప్రతాప రామకృష్ణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి పరిపూర్ణానంద మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రతి పైసా లెక్కచెప్పి ఖర్చుచేస్తామని, పారదర్శక పాలను అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్య పాలను అందించే సత్తా బీజేపీకే ఉందని ఆయన చెప్పారు. ప్రతాప రామకృష్ణను భారీ మోజార్టీతో గెలిపిస్తే నరేంద్రమోదీని వేములవాడకు తీసుకువస్తానని స్వామి చెప్పారు. 35 సంతవ్సరాలుగా పార్టీకి పనిచేస్తున్న ప్రతాప రామకృష్ణను గెలిపించాలని సూచించారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న స్వామి పరిపూర్ణానంద