తెలంగాణ

కెసిఆర్ పచ్చి మోసగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 5: కాంగ్రెస్‌లో నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేదని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మెదక్ ఎంపి నంది ఎల్లయ్య అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా డిసిసి భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ, పార్టీలోని లోపాలను సరిదిద్దుకొని 2019లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలన్నారు. పార్టీలోని నాయకుల, కార్యకర్తల మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టి ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. సిఎం కెసిఆర్ తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పునాది కూడా దాటేలేదన్నారు. కెసిఆర్ మోసాలను ప్రజలకు ఎండగడుతూనే పథకాలు అమలు చేసే వరకు పోరాటాలు చేస్తామన్నారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వాఖ్యలను ఎల్లయ్య తప్పు పట్టారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, టిపిసిసి నాయకులు ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.