తెలంగాణ

విద్యార్థిని అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఠంపల్లి, డిసెంబర్ 14: అనుమానస్పదస్థితిలో విద్యార్థిని మృతిచెందిన ఘటన మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చోటుచేసుకుంది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన సలిగంటి నీరజ (17) ఇంటర్ చదువుతోంది. రోజూవారిగానే గురువారం రాత్రి వరకు విద్యార్థులతో కలిసి ఉన్న నీరజ ఉదయం సమయంలో ఎంతకి బాత్‌రూం డోర్ తెరవకపోవడంతో తోటి విద్యార్థినులు తలుపులను గట్టిగా కొట్టి తీసి చూడడంతో లోపల ఊరివేసుకోని ఉంది.
సమాచారం అందుకున్న హూజర్‌నగర్ సీఐ భాస్కర్, ఎస్‌ఐ రంజిత్‌లు పోస్ట్‌మార్టం నిమిత్తం హూజర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు బంధువులు చేరుకోని విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పోలీసులు పోస్ట్‌మార్టం రిపోర్ట్ అందేవరకు వేచిచూడాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తునట్లు మఠంపల్లి ఎస్‌ఐ తెలిపారు. నిన్నటివరకు తమతో కలిసి ఉన్న సహచర విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో విద్యార్థినులలో భయందోళన నెలకొన్నాయి.