తెలంగాణ

కేటీపీపీ షట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/గణపురం, డిసెంబర్ 15 : జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) మొదటి, రెండో దశలు శనివారం షట్ డౌన్ చేశారు. వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో గత్యంతరం లేక అధికారులు మొదటి దశ 500 మెగావాట్లు, రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లను నిలిపివేశారు. గురువారం రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లోని టర్బన్ జనరేటర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలు సరిచేసిన ఇంజనీర్లు తిరిగి ప్లాంట్‌ను అదే రోజు రాత్రి సింక్రనైజేషన్ చేసేందుకు సిద్దం కాగా మరోసారి సాంకేతిక లోపం బయటపడి ప్లాంట్ నిలిచిపోయింది. దీంతో అధికారులు ఢిల్లీ నుండి ప్రత్యేక బృందాలను పిలిపించి మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. రెండో దశ పరిస్థితి ఇలా ఉండగా మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ లీకేజి కావడంతో ఆ ప్లాంట్‌ను కూడా షట్ డౌన్ చేశారు. కేటీపీపీ చరిత్రలో 48 గంటల వ్యవధిలో రెండు ప్లాంట్లు షట్ డౌన్ కావడం ఇదే మొదటి సారి అని కార్మికులు అంటున్నారు. గత ఎనిమిది నెలలుగా విద్యుత్ ప్లాంట్‌లో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు నాసిరకం బొగ్గును వాడటంతో విద్యుత్ ప్లాంట్‌లు తరచూ మొరాయించడం వలన జెన్-కోకు ప్రతి రోజు కోట్లలో నష్టం వాటిల్లుతుందని విమర్శలు వ్య క్తమవుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిలిచిపోయినప్పటికి అధికారులు ఆ విషయాన్ని గోప్యంగా ఉం చుతున్నారు. గతంలో కేటీపీపీలో పీ ఆర్‌వోను ఏర్పాటు చేసి ప్లాంట్‌లో ఎలాంటి సమాచారాన్నైనా మీడియాకు తెలియజేసేవారు. కానీ నూతనంగా వచ్చిన సీ ఈ కనీసం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలైన కేటీపీపీ విద్యుత్ ప్లాంట్‌లపై కొందరు అధికారులు పెత్తనం చలాయించడం వలనే ప్లాంట్ల పరిస్థితి ఈ విధంగా తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్లాంట్లు వరుసగా నిలిచిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు బాహటంగానే విమర్శిస్తున్నారు. రెండు ప్లాంట్లు తిరిగి విద్యుద్‌త్పత్తి కావాలంటే నాలుగు రోజులు పడుతుందని సమాచారం.