తెలంగాణ

హుజూర్‌నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, డిసెంబర్ 15: హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇక మీదట అందుబాటులో ఉండి పనిచేస్తానని స్థానిక ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పార్టీల గెలుపు, ఓటములు సహజమన్నారు. తనకు పీసీసీ చీఫ్ బాధ్యతలు ఉండటంతో నియోజవర్గానికి ఎక్కు వ సమయం కేటాయించలేపోయానన్నారు. దానివల్ల జరిగిన నష్టాన్ని గమనించానన్నారు. ఇక ముందు హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యత తనతో పాటు కార్యకర్తలపై ఉందన్నారు. త్వరలో సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాలు, ఎంపీల ఎన్నికలు రానున్నందునా కార్యకర్తలు ధైర్యంతో ప్రజల మధ్య ఉండి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనీయర్ నాయకులు సామల శివారెడ్డి, మంజూనాయక్, నిజాముద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి