తెలంగాణ

మన ఊహలు పతంగి ఎగిరేంతగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: మన ఊహలు, ఆశయాలూ పతంగి ఎగిరేంత ఉన్నతంగా ఉండాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాపటు చేసిన పతంగుల పండుగను ఆదివారం ఉప రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం అన్నారు. ప్రతి పండుగ వెనుక తప్పని సరిగా అర్థం ఉందన్నారు. పతంగుల పండుగను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రోత్సహించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పతంగిని ఎగుర వేశారు. పరేడ్ గ్రౌండ్‌లో స్వీట్ ఫెస్టివల్ కూడా ప్రారంభమైంది.
చిత్రం..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన పతంగుల పండుగను ప్రారంభించి మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు