తెలంగాణ

భూమి కోసం టవర్ ఎక్కి హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్, జనవరి 16: అన్నదమ్ములు తనకు భూమి ఇవ్వడం లేదంటూ ఓ యువకుడు టవర్ ఎక్కి గంటపాటు హల్‌చల్ చేసిన సంఘటన బుధవారంనాడు నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. సికింద్లాపూర్ గ్రామానికి చెందిన జెరుపుల రవినాయక్ (30)కు నర్సాపూర్ మండలంలోని అద్మాపూర్ గ్రామంలో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా అతని తండ్రి జెరుపుల జెత్యానాయక్ మృతి చెందడంతో అన్నదమ్ములు తనకు భూమిని ఇవ్వడం లేదని ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోయాడు. దాంతో విసుగు చెంది టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని చెప్పాడు. బుధవారం సాయంత్రం సమయంలో స్థానిక పోచమ్మగుడి ఎదుట గల రిలయన్స్ టవర్ ఎక్కి అందరినీ ఆందోళనకు గురి చేశాడు. దాంతో ఎస్‌ఐ వెంకట్‌రాజాగౌడ్, తహశీల్దార్ భిక్షపతి అక్కడికి చేరుకుని టవర్ దిగాల్సిందిగా కోరారు. గంటపాటు హల్‌చల్ చేసిన అనంతరం దిగివచ్చి అధికారులకు భూమి సమస్య ఉందని వివరించాడు. కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నరని అది భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి టవర్ ఎక్కానని అన్నాడు. భూమి విషయమై విచారణ జరిపించి న్యాయం చేస్తామని అధికారులు హమీ ఇచ్చారు.
చిత్రం..టవరెక్కిన యువకుడు