తెలంగాణ

కష్టపడే నేతలకు గుర్తింపు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ప్రజల్లో పట్టు, పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్టానంలో గుర్తింపు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెదవి విరిచారు. శాసనసభ లాబీల్లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, లాబీయింగ్‌లు చేసే వారికే అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందని వాపోయారు. ప్రజల్లో పట్టున్న నేతలు రాహుల్‌గాంధీని కలువకుండా కోటరి అడ్డుపడుతోందన్నారు. ఢిల్లీలో లాబీయింగ్‌కు ఫుల్‌స్టాప్ పడితే తప్ప కష్టపడే వారికి గుర్తింపు లభించే పరిస్థితి లేదన్నారు. లాబీయింగ్‌లు చేసే వారికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకున్ని ఎంపికచేస్తే పార్టీకి నష్టమేనని ఆయన హెచ్చరించారు. సమర్థుడైన నాయకుడికే సీఎల్‌పీ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సీఎల్‌పీ నేత ఎంపికపై పార్టీ అధిష్టానం సేకరించిన అభిప్రాయాలకు అనుగుణంగా ఎంపిక జరుగాలన్నారు. ఈ పదవికి సమర్థుడైన నాయకుడు ఎవరన్న విషయంపై రాహుల్ గాంధీ రహస్య నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. సీఎల్‌పీ నేతగా రాహుల్‌గాంధీ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.