తెలంగాణ

ర్యాంక్‌అప్ జేఈఈ స్కోర్‌ను ప్రారంభించిన గ్రేడ్‌అప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: గ్రేడ్‌అప్ సంస్థ జేఈఈలో అత్యుత్తమ ర్యాంకులను సాధించేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమం ర్యాంక్‌అప్ జేఈఈని ప్రారంభించినట్టు సంస్థ ప్రతినిధి షోబిట్ భట్నాగర్ చెప్పారు. రెండో ప్రయత్నంలో తమకు మంచి ర్యాంకు రావాలని కోరుకునే జేఈఈ ఔత్సాహికుల కోసం తాము ప్రత్యేకించి ఈ కోర్సును రూపొందించామని అన్నారు. వేలాది మంది విద్యార్థులకు తద్వారా లబ్ది చేకూరుతుందని చెప్పారు. గ్రేడ్ అప్ ప్రకటించిన నాటి నుండి దాని ప్రత్యేకమైన బోధన పద్ధతులు, అనుకూల ఫలితాలు దేశవ్యాప్తంగా 2500 పైగా నగరాల నుండి ఇంత వరకూ సుమారు 1.3 కోట్ల మంది అభ్యర్థులను గ్రేడ్‌అప్‌లో నమోదు చేసుకున్నారని అన్నారు. జనవరి నెలలో నిర్వహించిన పరీక్షలో వచ్చిన స్కోర్‌ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌లో జరిగే పరీక్ష కోసం అభ్యర్థులను సన్నద్ధం చేస్తామని అన్నారు.