తెలంగాణ

ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు గుర్తు వచ్చాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: లోక్‌సభ, ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంక్షేమ పథకాలు గుర్తు వస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సంకల్ప యాత్ర దిగ్విజయం కావడంతో చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకున్నదని, అందుకే పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రజలకు ఏదో చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశాలను సుదీర్ఘంగా నిర్వహిస్తూ, బిల్డప్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాల తరహాలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా చంద్రబాబు చేపట్టారా? అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుతో అటు కేంద్రానికి, ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భయపెడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఏపీకీ రావాల్సిన హక్కుల కోసం ఎందుకు పోరాడడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.