తెలంగాణ

మలివిడత ఎన్నికలకు పకడ్బందీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 22 : సిద్దిపేట జిల్లాలో 25న గజ్వేల్ డివిజన్‌లో జరిగే రెండో విడుత పంచాయతీ ఎన్నికల విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. మొదటి విడుత పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని, ఇదే స్ఫూర్తితో రెండో విడుత పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో రెండో విడుత పంచాయితీ ఎన్నికలపై జేసీ పద్మాకర్, డీఆర్‌ఓ చంద్రశేఖర్, డీపీఓ సురేష్‌బాబు, ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, విజయచంద్రారెడ్డిలతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండో విడుత గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ 8 మండలాల్లో 191 గ్రామాల్లో , 1592 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమగు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు కావాల్సిన ఎన్నికల సామాగ్రీ, పోలింగ్ పర్సన్స్, మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ నిర్వహించే వాళ్లు, పోలింగ్ పర్సన్స్, జోనల్ ఆఫీసర్లు, రిటర్నింగ్ అధికారులు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్‌లు ఎన్నికల సరఫరాపై సమీక్షించారు.
కిష్టసాగర్ గ్రామ సందర్శన
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ సిద్దిపేట మండలం కిష్టసాగర్ గ్రామాన్ని సందర్శించారు. స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ కార్యాక్రమంలో భాగంగా నిర్మించుకున్న మరుగుదొడ్డిని అందమైన రంగులతో పెయింటింగ్స్ అలంకరించుకొని వాడుకోలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ కృష్ణ్భాస్కర్ వివరించారు. మరుగుదోడ్లను రంగులు వేసి, అందంగా అలకంకరించటం పట్ల గ్రామస్తులను కలెక్టర్ అభినందించారు. గ్రామాభివృద్ధి కొరకు గ్రామంలోని 103 కుటుంబాలు ఐక్యంగా ముందుకు రావటం అభినందనీయమన్నారు. గ్రామాంలో రెండు రోజుల్లో మరుగుదొడ్లు పూర్తిగా నిర్మించారని, కిష్టసాగర్ గ్రామం పిలుపుతో అన్ని గ్రామాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కిష్టాసాగర్ వలే మిగత గ్రామాల్లోని మరుగుదోడ్లకు పెయింటింగ్‌లు వేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, విజేందర్‌రెడ్డి, డీఆర్‌డీఎ పీడీ నవీన్, ఎంఆర్‌ఓ, ఎపీఎంబీ చంద్రం, సీసీ రేఖశ్రీ, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.