తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, జనవరి 22: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఉట్లపల్లికి చెందిన చిలక యాదగిరి, రెడ్డిమల్ల నాగరాజు, చీమలపాటి నాగేష్, దోరేపల్లి వెంకన్న, షేక్‌జావిద్, పగడాల వెంకన్న, శ్రీనివాస్, సైదులు, నకిరేకంటి నగేష్, శ్రీకాంత్‌లతో పాటు వందమంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుఖేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాడానికి కేసీఆర్ చేస్తున్న కృషికి అందరు తోడ్పాటును అందించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి గ్రామపంచాయతీల్లో గులాబీజెండాను ఎగురవేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనవత్ చిట్టిబాబునాయక్, ఎంపీపీ నూకల సరళా రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

చిత్రం.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి