తెలంగాణ

కేసీఆర్ అరాచకాలపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అరాచకాలపై పోరు సాగిస్తానని, ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయడానికే తాను పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుం చి పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు రేవంత్ వ చ్చారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పార్లమెంట్ ఎన్నికల్లో తన కు మద్దతు ఇచ్చే అంశంపై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు నేతలు మీడియా తో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గంలోని సీపీఐ కేడర్ రేవంత్‌రెడ్డి కోసం పని చేస్తుందని చాడ వెంకటరెడ్డి భరోసా ఇచ్చారు. ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ అని సీపీఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లౌకిక శక్తులకు మద్దత్తు ఇస్తామని చాడ వెల్లడించారు. ‘బీజేపీ, తెరాసను ఓడించండి’ అన్న నినాదంతో పని చేస్తామన్నారు. ఢిల్లీలో మోదీని తెలంగాణలో కేడీని నిలువరించాలంటే కమ్యూనిస్టుల సహకారం ఎంతైనా ఉందని రేవంత్ అన్నారు. సినిమాల్లో గచ్చిబౌలి దివాకర్ క్యారెక్టర్‌లాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఓ జోకర్ అం టూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాం గ్రెస్ మెజార్టీ సీట్లు దక్కించుకుంటుందన్నారు. కాంగ్రెస్‌కు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు తమ పార్టీ కేడర్ పని చేస్తుందని చాడ స్పష్టం చేశారు.
చిత్రం.. ముఖ్దూం భవన్‌లో ఆదివారం చాడ వెంకటరెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి